ఓ వ్యక్తిని మహిళలు చెట్టుకు కట్టేసి చెప్పుతో చితకబాదిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మందమర్రి పట్టణంలోని 1వ జోన్కు చెందిన గంధం శ్రీకాంత్ తన ఇంటి ముందు ఉండే ఓ వివాహితను ఇంట్లోకి పిలిచి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించి, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో కాలనీవాసులు నిందితుడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ మేరకు శ్రీకాంత్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.