షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై వేట కొడవళ్లతో ఇద్దరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కేశంపేట రోడ్డులో పృథ్వీరాజ్ అనే వ్యక్తిపై ఇద్దరు దుండగులు వేట కొడవళ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన పృథ్వీరాజ్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దుండగుల్లో ఒకరిని నందీశ్వర్గా గుర్తించామని, మరొకరిని గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.