గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలపై సమగ్ర నివేదికను వారంలోగా అందజేయాలని అధికారులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. వెలగపూడిలో శుక్రవారం గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాలకు దారితీసిన కారణాలపై అధికారులతో సమీక్షించారు. తురకపాలెంలో సీనియర్ వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతూనే ఉండాలని సూచించారు. వరుస మరణాల గురించి జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో విఫలం అయ్యారన్నారు.