కనిగిరి పట్టణంలోని పాత మంచినీటి దొరువును ఎమ్మెల్యే ముక్కు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మున్సిపల్ కమిషనర్ పి కృష్ణమోహన్ రెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా దొరువు అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై కమిషనర్ తో ఎమ్మెల్యే చర్చించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఏ పనులను చేపట్టాలో కమిషనర్ తో ఎమ్మెల్యే చర్చించారు. దొరువు ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతో పాటు, అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.