డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కడప టూ టౌన్ సి.ఐ జి.సుబ్బారావు పిలుపునిచ్చారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కడప టూ టౌన్ పిఎస్ పరిధిలోని బిస్మిల్లా నగర్ లో శనివారం సాయంత్రం "పోలీసు కళా-జాగృతి బృందం" ఇన్ఛార్జ్ జి.నరసరామ్ మరియు వారి బృందం ఆధ్వర్యంలో ''ఓయువతా..మేలుకో'' నాటక ప్రదర్శన నిర్వహించారు. మత్తు పదార్థాల వాడకం వల్ల ప్రజలకు వచ్చే ఆరోగ్య సమస్యలు, అనర్ధాలు, సమాజంలోని రుగ్మతలు గురించి అవగాహన కల్పించారు.