పలమనేరు: ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని వారి స్వగృహంలో ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తో పాటు ఆలయ అర్చకులు ఆహ్వానించారు. ఈనెల 27 నుంచి వచ్చేనెల 16వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలన్నారు. ఈ సందర్భంగా వేదాశీర్వచనం అందించి తీర్దప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు టీడీపీ సీనియర్ నాయకులు మణినాయుడుతో పాటు పలమనేరు నాయకులు ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ బోయకొండ ఆలయ ఈవో ఏకాంభరం సైతం మర్యాద పూర్వకంగా కలసి అమ్మవారి ప్రసాదాలను అందించారు.