రొల్ల మండలం గొల్లహట్టిలో మారెన్న(35) అనే వ్యక్తి విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు.గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మారెన్న పొలం పనుల కోసం వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.