రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం 8వ, రోజు గణనాథుడు నీలివర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.