కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తోలి తిరుపతి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానానికి, శనివారం వేకో జాము నుండి సుమారు 12 వేల మంది భక్తులు, స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని, ఆలయ కార్య నిర్వహణ అధికారి వడ్డీ శ్రీనివాస్ మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చినటువంటి ఆదాయాన్ని ఆయన తెలిపారు, 2,15,699 రూపాయలు ఆదాయం దేవస్థానానికి సంపూర్ణట్లు తెలిపారు. దేవస్థానం తరుపున భక్తులకు ఉదయం పులిహార ప్రసాదం గాను, మధ్యాహ్నం అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.