శని అమావాస్య సందర్భంగా సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంటపురంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో నరసింహ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఆలయ పురవీధుల గుండా నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అంటూ భగవాన్ నామస్మరణ చేశారు.