ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని జీవీఆర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద లడ్డు వేలంపాటను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేకమంది భక్తులు పోటీగా పాల్గొన్నారు. చివరగా జి.వి.ఆర్ రోడ్డులో నివసిస్తున్న చైతన్య, సుజి కార్తీక్ ఈ వేలంలో విజయం సాధించారు. 75 కేజీల లడ్డును 86వేలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా జీవీఆర్ గణేష్ ఉత్సవ కమిటీ వారు విజేతలను శాలువాలతో సత్కరించారు. శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ లడ్డు వేలం పాట జరిగింది. అనంతరం గణేష్ నిమజ్జనం ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది.