ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యం మేరకు పెండింగ్ లేకుండా.. పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో.. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP), ఎంఐ ట్యాంకులు & గ్రౌండ్ వాటర్, సానుకూల ప్రజా దృక్పథం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్లోడ్, స్వమిత్వ కార్యక్రమం, స్వచ్ఛ ఆంధ్ర అవార్డులపై సూచనలు, జిల్లా జువెనైల్ జస్టిస్ కమిటీల ఏర్పాటు & అమలుపై సమీక్షించారు.