గుంటూరు నగరంలోని మొబైల్ షాప్ ఓనర్స్ అండ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు గుంటూరు అరండల్ పేటలోని వైన్ డీలర్స్ కల్యాణ మండపంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో 340 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని సంఘ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, అనంతరం నూతన సభ్యుల ప్రమాణస్వీకారం జరుగుతుందని సభ్యులు తెలిపారు.