దసరా ఉత్సవాలు అమలాపురం పట్టణంలో చారిత్రాత్మక నేపథ్యం కలిగినవని, అటువంటి ఉత్సవాలను అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. శుక్రవారం అమలాపురంలోని కలెక్టరేట్ లో జిల్లా డివిజన్ స్థాయి పోలీసు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, దేవాదాయశాఖ అధికారులు, ఉత్సవ కమిటీ పెద్దలతో సమావేశం నిర్వహించారు. దసరా ఉత్సవాల నిర్వహణ సన్నద్ధత అంశాలపై సమీక్షించారు.