వైయస్సార్ కడప జిల్లా వల్లూరు మండల పరిధిలోని జంగంపల్లి గ్రామ సమీపాన ఒక ఇసుకలోడు ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటన కలకలం రేపింది, స్థానికుల తెలిపిన సమాచారం ప్రకారం, పైడికాలువ క్రాస్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కడపకు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్, అదుపుతప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.