రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మతంగా చెపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైంది.ఈ నేపత్యంలో భీంపూర్ మండలం తాంసి-కె గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సర్వే ప్రక్రియను పరిశీలించారు.సర్వేలో భాగంగా సిబ్బంది ఇంటింటికి అతికిస్తున్న స్టిక్కర్లను పరిశీలించారు. సర్వేను పారదర్శకంగా చేయాలని సిబ్బందికి ఆదేశించారు.