సమాజ సేవలో సామాజిక దృక్పదమే సంకల్పం కావాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. దాతల సహకారంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల లిఫ్ట్ కోసం ఖాజా పాషా రూ.20 లక్షలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యతోనే దేశ భవిష్యత్తు సాధ్యమన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.