కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, రైతన్నకు అండగా అనే కార్యక్రమాన్ని, పెద్దాపురం వైసిపి ఇన్చార్జ్ దొరబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, నరసింహ, ప్రత్తిపాడు ఇంచార్జ్ ముద్రగడ గిరి, కాకినాడ పార్లమెంటరీ పరిశీలకులు సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం నుండి RDO కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఏవో కు ఎంత పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.