తప్పిపోయిన 11 ఏళ్ల బాలికను రేపల్లె పోలీసులు గంటల వ్యవధిలో సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.బుధవారం సాయంత్రం రేపల్లె డిఎస్పి శ్రీనివాసరావు మీడియాకు ఈ ఘటన వివరాలు తెలిపారు.స్కూలుకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆచూకీ కనుగొన్నారు. పట్టణంలోని నేతాజీ నగర్ సచివాలయం వద్ద ఆ బాలిక ఉండగా పోలీసులు గుర్తించి స్టేషన్ కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు