మహబూబ్నగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయంలో ఉచిత న్యాయ సేవా క్లినిక్ ను జిల్లా జడ్జి పాపిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ క్లినిక్ రక్షణ సిబ్బంది, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్య క్రమంలో జడ్జి ఇందిరా, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.