డీజే యజమానులకు మిల్స్ కాలని పోలీసుల హెచ్చరిక వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో, నగరంలోని డీజే యజమానులు మరియు ఆపరేటర్లతో పోలీసు అధికారులు సమావేశం నిర్వహించారు. గణేష్ శోభాయాత్రల్లో డీజే (సౌండ్) ఏర్పాటు చేయవద్దని వారికి హెచ్చరించారు. ఈ నిబంధనని ఎవరైనా అతిక్రమిస్తే, వారికి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.