ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామ సమీపంలో ప్రజలు రోడ్డు పై ట్రాక్టర్లు అడ్డంపెట్టి నిరసనకు దిగారు. సోమవారం రాత్రి గుర్తు తెలియనివాహనం ఢీ కొట్టి వెళ్లిపోగా ఓ వ్యక్తి మృతి చెందాడు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే తమ ప్రాంతంలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మంగళవారం నిరసనకు దిగారు. పోలీసులు వారిని సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.