బాపట్ల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ తుషార్ డూడీ ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించారు.వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. తనకు అందిన 57 అర్జీలను ఆయన సంబంధిత పోలీస్ అధికారులకు ఎండార్స్ చేశారు. నిర్ణీత కాల వ్యవధిలో,చట్ట పరిధిలో ఈ అర్జీలలోని సమస్యలను పరిష్కరించాలని ఆయన వారిని ఆదేశించారు.నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.