ఎల్లారెడ్డి : ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుంటే బీసీ సభను అడ్డుకుంటామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్పష్టం చేశారు. పంట పొలాలు నష్టపోయిన రైతులను నేటికీ ఆదుకోలేదని, రైతుల పట్ల సీఎం కు, స్థానిక ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఇటీవల నియోజకవర్గానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రైతులను పరామర్శించకుండా విహారయాత్రకి వచ్చి వెళ్లినట్లుగా ఆయన పర్యటన సాగింది అన్నారు. ప్రత్యేక నిధులతో కూడిన ప్యాకేజీ ఇస్తారనుకుంటే పది రూపాయలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రెండు మూడు రోజుల్లో ప్యాకేజీని కేటాయించాలని డిమాండ్ చేశారు.