చింతపల్లి మండలంలోని కోరుకొండ, బురుసింగి, ఉమ్మరాజగొంది, తాజంగి గ్రామాల్లో బుధవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి, సైంటిస్ట్ లు బయ్యపురెడ్డి, సందీప్, ఏవో మధుసూధనరావు సభ్యుల బృందం పర్యటించింది. కాఫీ రైతులతో మాట్లాడి, తోటలను పరిశీలించారు. ప్రస్తుతం ఆయా తోటల్లో బెర్రీ బోరర్ తెగులు సోకలేదని నిర్ధారించారు. అయితే తెగులు సోకే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు.