ఒంగోలులో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర 28వ మహాసభల సందర్భంగా చలో ఒంగోలు కార్యక్రమానికి బాపట్ల సిపిఐ నాయకులు శనివారం బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్ధిల్లాలి సిపిఐ పార్టీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సింగరకొండ మాట్లాడుతూ మహాసభలను కార్మికులు, కర్షకులతో పాటు సిపిఐ సానుభూతిపరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.