అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద శుక్రవారం సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సీఐటీయూ నాయకుడు వెంకటేష్ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు మల్లేష్, నిర్మల మాట్లాడుతూ 1970లో సీఐటీయూ స్థాపించబడిందన్నారు. కార్మిక హక్కుల సాధనకు నిరంతరం కృషి చేసిందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కార్మికులందరూ పోరాటం చేయాలని అన్నారు.