Download Now Banner

This browser does not support the video element.

మాసాన్ పల్లిలో దళిత కుటుంబంతో కలిసి సన్న బియ్యంతో భోజనం చేసిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులు

Gundala, Yadadri | Apr 6, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండల పరిధిలోని మాసాన్ పల్లి గ్రామంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆయన కుటుంబంతో కలిసి దళితుల ఇంటిలో సన్న బియ్యంతో సహాపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. సంపన్నులతో సమానంగా పేదలు కడుపునిండా సన్న బియ్యంతో భోజనం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us