మహబూబాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి మాట్లాడుతూ.. పట్టణంలోని కొత్త బజారు వైపు 4 నెం ప్లాట్ ఫారం లేక వృద్దులు,ప్రయాణికులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే రైల్వే స్టేషన్ లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపి కరోనా సమయంలో రద్దయిన ప్యాసింజర్లను పునర్ ప్రారంభించాలని కోరారు.