ముమ్మిడివరం మండలం, ఠాణేలంక ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసారు. రాజుపాలెం వద్ద మంగళవారం కొబ్బరి డొక్కల లోడుతో వెళ్తున్న ఐషర్ లారీ కింద పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీనిపై ముమ్మిడివరం ఏఎస్సై తెలిపిన వివరాల ప్రకారం లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో బైక్ అదుపుతప్పి లారీ కింద పడటంతో ప్రమాదం జరిగింది. మృతుడు కూనలంక గ్రామానికి చెందిన కొప్పిశెట్టి గంగరాజు(46) గా గుర్తించామన్నారు.