Download Now Banner

This browser does not support the video element.

యాదగిరిగుట్ట: సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సంప్రోక్షణ అనంతరం కైంకర్యాలు మొదలు

Yadagirigutta, Yadadri | Sep 8, 2025
సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెరుచుకుంది. సోమవారం ఉదయం 3:30 గంటలకు ఆలయం తెరిచి సంప్రోక్షణ చేసి సుప్రభాత సేవ, బిందెతీర్థం, బాల భోగం, నిజాభిషేకం పూజలు నిర్వహించినట్లు ఉదయం ఆలయ అర్చకులు తెలిపారు. ఉదయం 8:30 గంటలకు భక్తులకు సర్వదర్శనాలు అనుమతించబడతాయని తెలిపారు. సత్యనారాయణ వ్రతాలు, వాహన పూజలు, నిత్య కైంకర్యాలు, కళ్యాణం, బ్రహ్మోత్సవం, ఊరేగింపు సేవలు తిరిగి పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపారు. అనుబంధ దేవాలయం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పూజలు యధావిధిగా కొనసాగుతున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us