చిత్తూరు జిల్లా పుంగనూరు మండల సమీపంలో బట్టందొడ్డి గ్రామం వద్ద మంగళవారం రాత్రి అయ్యప్ప స్వాములు పూజలో నిర్వహించుకుని ఆలయం వద్ద ఉండగా పలమనేరు నుంచి మదనపల్లి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం అతివేగం గా వచ్చి అదుపుతప్పి స్వాములపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అయ్యప్ప స్వాములు వినయ్ కుమార్, ప్రకాష్ ,త్రీవంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని వెంటనే హైవే ఆంబులెన్స్ సిబ్బంది పైలెట్ సయ్యద్ , ఈ ఎం.టి. కిరణ్ కుమార్ , పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వినయ్ కుమార్, ప్రకాష్, పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.