సమాజంలో విలువలతో కూడిన సాహిత్యానికి ఎదురు ఉండదని ఎమ్మెల్సీ, రచయిత గోరేటి వెంకన్న అన్నారు. ఒంగోలులో సీపీఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహిస్తున్న కళా మహోత్సవానికి గోరేటి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంసీఏ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆయన మాట్లాడారు. నేటి కొన్ని సినిమాలు, బూతు సాహిత్యంతో నిండుకొని, ఇదే అసలైన కలలు అన్న తీరుగా భ్రమింపజేస్తున్నాయంటూ విమర్శించారు.