వేటపాలెం రైల్వే స్టేషన్ పరిసరాల్లో శనివారం తప్పిపోయి తిరుగుతున్న నరసింహ అనే బాలుడి చిరునామా కనిపెట్టి ఎస్సై జనార్ధన్ అతడి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.పోలీసులు ఆ బాలుడిని గుర్తించి స్టేషన్ కు తీసుకురాగా ఎస్సై అతడి ఫోటోను మహిళా పోలీసుల గ్రూపుల్లో పెట్టగా వివరాలు తెలిసాయి.దీంతో నవజ్యోతి కాలనీకి చెందిన ఆ బాలుడి తల్లిదండ్రులను పిలిపించి నరసింహను అప్పగించారు. దీంతో వారు కృతజ్ఞతలు తెలిపారు.