సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో ఉచిత సంగీత రుత్య కీబోర్డ్ శిక్షణ శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించినట్లు నిర్వాహకులు శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ప్రతి ఒక్కరూ భారతీయ సంగీతం నృత్యం నేర్చుకోవాలని ఉద్దేశంతో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.