మాదాపూర్ లోని జూబ్లీ ఎనక్లేవ్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. పార్కు రహదారిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. రూ.400 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి రక్షించింది. జూబ్లీ ఎనక్లేవ్లోని 4 పార్కుల్లో 2 పార్కులు, ప్రభుత్వ స్థలం, రహదారిని కబ్జా చేయగా వాటిని ఈరోజు కూల్చివేసింది.