నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి మండల పరిధిలోని చిరుమర్తి ఆగమౌత్కూర్ గుర్రప్పగూడెం గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల డిఆర్డిఏ ఏపీఎం భాషపాక చంద్రశేఖర్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. దాన్యం కొనుగోలులో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీఎం వెంట సిసి సైదులు, రేణుక ఉదయభాను సోనియా తదితరులు ఉన్నారు.