పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం అత్తిలి గ్రామంలోనీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 9వ తేదీన చేపట్టనున్న ఎరువుల బ్లాక్ మార్కెట్, గిట్టుబాటు ధరపై అన్నదాతల పోరు - రైతన్నలకు బాసటగా వైయస్సార్సీపీ కార్యక్రమ పోస్టర్ ను ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మాజీ మంత్రివర్యులు మరియు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.