Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 9, 2025
ఉలవపాడు (M) వీరేపల్లి STకాలనీకి చెందిన యాకసిరి చెంచయ్య (40) మంగళవారం తెల్లవారుజామున హైవే పై జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. వీరేపల్లి జంక్షన్ వద్ద బైక్పై ఊర్లోకి వెళుతున్న చెంచయ్య ను నెల్లూరు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చెంచయ్యను హుటాహుటిన ఉలవపాడు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగింది.