నంద్యాల జిల్లా మిడుతూరు మండలం ప్రజలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి అందజేస్తున్నామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల్లో 8 మంది లబ్ధిదారులకు 609,644 రూ.ల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారికి భరోసానిస్తూ చెక్కులను అందజేశారు.ఈ సందర్బంగా కష్టాల్లో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.సీఎం సహాయనిధి లబ్దిదారుల వివరాలు: వీపనగండ్ల:జి వెంకటేశ్వర్ రెడ్డికి 86,870రూ.లు,మిడుతూరు కె సత్యనారాయణ 48,333