రాజధాని అమరావతి ప్రాంతంలో విద్యాలయాలు, విద్యా రంగం అభివృద్ధి పై బుధవారం బ్రాడీపేటలో సీపీఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాజధాని అభివృద్ధి వేదిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యుడు కె.యస్ లక్ష్మణరావు మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఒక్కటే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందని, రెండు వర్సిటీలకు స్థలాలు కేటాయించిన రాజధాని ప్రాంత విద్యార్థులకు రాయితీలు ఇవ్వడం లేదని మండిపడ్డారు.