Download Now Banner

This browser does not support the video element.

నిజామాబాద్ సౌత్: నగరంలో విద్యుత్ షాక్ లో పెయింటర్ మృతి

Nizamabad South, Nizamabad | Aug 31, 2025
నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సీతారాం నగర్ కాలనీలో ఓ పెయింటర్ విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కాలనీలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. పనులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన నాందేవ్ (45) ఆ ఇంటికి పెయింటింగ్ వేయడానికి వచ్చాడు. అయితే ఇంటిపైన విద్యుత్ తీగలు ఉన్నాయి. నాందేవ్ ప్రమాదవశాత్తు వాటికి తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై గంగాధర్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us