ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం నాగవరం కూడలిలో అధిక బరువుతో వెళుతున్న 9 టిప్పర్లను ఎస్సై ప్రసాద్ రావు అదుపులోకి తీసుకున్నారు. నాగవరం కూడలిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఈ టిప్పర్లు పట్టుబడ్డాయి. దీంతో ఆ టిప్పర్లకు రూ.5,51,110 జరిమానా విధించినట్లు తెలిపారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. అతి వేగంగా వెళ్లినా, అధిక లోడ్తో వెళ్లిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.