ఓర్వకల్లు లోని బాలుర సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఇటీవల భోజనం వికటించి 10 మంది విద్యార్థులు విరేచనాలతో బాధపడిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై వార్డెన్ తన పైననే ఫిర్యాదు చేస్తారా అంటూ వసతి గృహంలో చదువుకుంటున్న బీసీ విద్యార్థులను బూతులు తిట్టి టీసీ లు తీసుకొని వెళ్లాలని విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీసీ విద్యార్థులకు ఈ వసతి గృహంలో తావు లేదని వెంటనే వెళ్ళిపోవాలని అన్నట్లు కొందరు విద్యార్థులు మీడియాకు తెలిపారు.