Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: దేవి నవరాత్రుల్లో భాగంగా ఆదిలాబాద్ నవశక్తి దుర్గామాత ఆలయంలో పసుపు బండార్ కార్యక్రమం

Adilabad Urban, Adilabad | Sep 26, 2025
దేవి నవరాత్రుల్లో భాగంగా ఆదిలాబాద్ నవశక్తి దుర్గామాత ఆలయంలో పసుపు బండార్ కార్యక్రమం నిర్వహించారు. పల్లకిలో అమ్మవారి ప్రతిమను ఉంచి స్వాములు పల్లకిని మోశారు. ఆలయ పీఠాధిపతి కిషన్ మహరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ పల్లకీ సేవను ప్రారంభించారు. అనంతరం పసుపు బండర్ నిర్వహించారు. పసుపు చల్లుకుంటూ అమ్మవారి పాటలకు నృత్యాలు చేస్తూ భవానీలు అలరించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us