ఎమ్మిగనూరు: 'విశ్వకర్మ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి'కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విశ్వకర్మ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మండల బీజేపీ నాయకుడు దేశాయ్ గురురాజారావు అన్నారు.మంగళవారం నందవరంలో బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ పథకం ద్వారా కేంద్రం అందజేసిన వాషింగ్ మిషన్లను రజకులకు పంపిణీ చేశారు. దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రధాని నరేంద్ర మోదీ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.