పామర్రు టౌన్ మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి రైతుల ధాన్యం కొనుగోలు విషయలు గురించి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జనసేనపార్టీ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్ వారితోపాటు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.