కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ ఫార్మాసిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ బొమ్మెర ఆధ్వర్యంలో, 9 నుంచి 26 ఏళ్ల మహిళల కోసం హెచ్పీవీ వ్యాక్సిన్ను ప్రభుత్వ ఆరోగ్య సేవల్లో చేర్చాలని కోరుతూ గురువారం వినతిపత్రం అందించారు. దేశంలో ప్రతి ఏటా 1,25,000 మంది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్తో బాధపడుతున్నారని, హెచ్పీవీ వ్యాక్సిన్ సర్వికల్ క్యాన్సర్తో పాటు అనేక ఇతర క్యాన్సర్లను తగ్గిస్తుందని ఆయన తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు