ధర్మవరం మండలం పోతుకుంట పంచాయతీ బీసీ కాలనీ వెనక ఉన్న నరసింహస్వామి గుట్ట వద్ద కొంతమంది స్థలం కబ్జా చేయడానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కాలనీ మహిళలు ప్రజలు నరసింహ స్వామి పుట్ట వద్దకు వెళ్లి కబ్జాకు ప్రయత్నం చేస్తున్న వారిని అడ్డుకున్నారు. ఈ స్థలం తమకు అధికారులు ఇచ్చారని వారు తెలపగా అధికారులనే ఇక్కడికి వచ్చి నిజ నిర్ధారణ చేయాలని కాలనీవాసులు పట్టుపట్టారు.