హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని 123 క్లస్టర్లకు జిపిఓల కేటాయింపు మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ తో అధికారులు చేపట్టారు. జిపివో పరీక్ష 128 మంది రాసి ఉత్తీర్ణులు కాగా వారికి క్లస్టర్ కేటాయింపు ప్రక్రియను కలెక్టరేట్ లో నిర్వహించారు. 123 క్లస్టర్లకు గాను 125 మంది జిపివో లను కౌన్సిలింగ్ ద్వారా కేటాయించారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్ ఆధ్వర్యంలో సాగింది. 128 మందిలో ముగ్గురు విముఖత చూపించగా 125 మంది జిపివోలు కౌన్సిలింగ్ కు హాజరయ్యారు. 123 క్లస్టర్లకు కౌన్సిలింగ్ ద్వారా కేటాయించారు.